Friday, May 17, 2024

పింక్ వ‌సాబి రెస్టారెంట్ – స్పెషాలిటీ ఏంటో తెలుసా

మ‌న‌కు అందుబాటులో ఎన్నో రంగులు ఉన్నాయి. ఒక్కొక్క‌రికి ఒక్కో రంగు న‌చ్చుతుంది. అయితే మ‌హిళ‌ల‌ల్లో ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డేది పింక్ క‌ల‌ర్ అని చెబుతుంటారు చాలామంది. మ‌రి మొత్తం పింక్ క‌ల‌ర్ తో వున్న రెస్టారెంట్ గురించి మీకు తెలుసా.. ముంబైకి చెందిన ప్రసూక్‌ జైన్ తన ఇష్టాన్ని తన వ్యాపారంలో భాగం చేసి ‘పింక్‌ వసాబి’ అనే రెస్టారెంట్‌ ప్రారంభించాడు. రెస్టారెంట్‌ గేటు మొదలుకొని నేల, పైకప్పు, కుర్చీలు, బల్లలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగు మేళవించే ఉంటాయి.

పైకప్పు, ఎలివేషన్‌ ఏరియాల్లో అచ్చంగా గులాబీలనే గుచ్చినట్లు డిజైన్‌ చేశారు. ఈ రెస్టారెంట్‌ మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడ వడ్డించే ఆహారం కూడా దాదాపు గులాబీ రంగులోనే ఉంటుంది. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలతోపాటు రెడ్‌ ఫుడ్‌ కలర్‌నుఉపయోగించి మాంసాహారం, శాకాహారం అనే తేడా లేకుండా అన్నిటినీ గులాబీ వర్ణంలోకి మార్చేస్తారు. ఇక్కడ వడ్డించే వాటిలో రాస్‌బెర్రీ, ఆపిల్‌, చెర్రీ వంటి ఎరుపు రంగు పండ్లే ఎక్కువగా కనిపిస్తాయి. మాక్‌టెయిల్స్‌ కూడా గులాబీ రంగులోనే, చివరికి టిష్యూలు కూడా పింక్ క‌ల‌ర్ లో ఉండ‌టం ఇక్క‌డి స్పెషాలిటీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement