Tuesday, April 30, 2024

విజయనగరం జిల్లాలో పులి సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు

విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం ఐతన్నపాలెంలో పులి సంచారం కలకలం రేపుతోంది. పులి దాడిలో ఒక ఆవు మృతి, మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే ప్రజల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement