Saturday, May 4, 2024

Arrest – డ్రగ్స్‌ పట్టివేతలో ఎస్సై రాజేందర్ చేతివాటం… 1,750 గ్రాముల హెరాయిన్ అమ్మేందుకు యత్నం

హైదరాబాద్ – డ్రగ్స్‌ పట్టివేతలో ఓ ఎస్సై చేతివాటం ప్రదర్శించాడు. నార్కోటిక్‌ విభాగం అధికారులు వలపన్ని పట్టుకోవడంతో అతడి అవినీతి బయటపడింది. దీంతో ఎస్సైను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో (సీసీఎస్‌) రాజేందర్‌ ఎస్సైగా పనిచేస్తున్నారు. నిందితుల వద్ద పట్టుబడిన డ్రగ్స్‌లో సుమారు 1,750 గ్రాముల వరకు దాచిపెట్టి అమ్మేందుకు ఎస్సై యత్నించారు.దీనిపై నగరంలోని నార్కోటిక్‌ విభాగం అధికారులకు పక్కా సమాచారం అందండంతో వారు వలపన్ని రాజేందర్‌ను అతడి ఇంట్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత నార్కోటిక్‌ విభాగం అధికారులు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) డైరెక్టర్‌, సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక ఇచ్చారు. అనంతరం నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించడంతో వారు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

.రాజేందర్‌పై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన రాయదుర్గం ఎస్సైగా పనిచేసినప్పుడు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అప్పట్లో అతడిని సర్వీస్‌ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఆ ఉత్వర్వులపై కోర్టు నుంచి రాజేందర్‌ స్టే తెచ్చుకున్నారు. ఈ తర్వాత సైబరాబాద్‌ సీసీఎస్‌ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement