Saturday, May 18, 2024

కారు టైర్ మారుస్తుంటే మృత్యువు కబళించింది

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. బీచుపల్లి వద్ద టాటా ఏస్‌ వాహనానికి పంక్చర్‌ పడింది. ఈ క్రమంలో వాహనం దిగిన ఇద్దరు వ్యక్తులు టైరు మారుస్తున్నారు అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు వారిని ఢీకొట్టింది

ఈ దుర్ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటకలోని హసన్‌జిల్లాకు చెందిన ముత్తురాజు, సంతుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement