Saturday, April 27, 2024

Telangana | శాసనమండలి చీఫ్ విఫ్​లుగా భాను ప్రసాదరావు, కౌశిక్​రెడ్డి నియామకం

తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా కరీంనగర్ ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భాను ప్రసాదరావు మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొందారు. గతంలో శాసనమండలి విప్ గా పనిచేశారు. భాను ప్రసాద్ రావు నియామకం పట్ల పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తో పాటు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కూడా..

తనపై నమ్మకంతో ప్రభుత్వ విప్ గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు , గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు పాడి కౌశిక్​రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఏ బాధ్యతను ఇచ్చిన సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. తనకు వెన్నుదన్నుగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకునే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలుచ శ్రేయోభిలాషులకు ఎల్లవేళలా కృతజ్ఞుడనై ఉంటానన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement