Wednesday, May 8, 2024

జగన్ ది ఆర్ఎస్ఎస్ దారి!

మోదీ లాంటి ఆర్‌ఎస్ఎస్ అడుగుజాడల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్‌ నడుస్తున్నారని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. జగన్‌ అహంకారపూరితంగా ఎన్నికలు జరిపిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి ఉందన్నారు. నియంతృత్వ విధానాల వైపు ప్రభుత్వాలు పోతున్నాయన్నారు. ప్రజాస్వామ్య విలువలకు గౌరవం ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం రీనోటిఫికేషన్ ఇవ్వాలని కోరిందన్నారు. ఎన్నికలు వదిలేసిన పోయిన చంద్రబాబు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో వైసీపీ గాలి కాదు.. దుమ్ము గాలి వీస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీని నిలదీయలేదని వాజమ్మలు వైసీపీ నాయకులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement