Saturday, May 4, 2024

డాక్టర్ ఘనకార్యం…. వెన్నుపూస ఆపరేషన్ ఫెయిల్

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా వెన్నుపూస ఆపరేషన్ వికటించి 28 ఏళ్ల మహిళమృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన కుమ్మరి కాంతమ్మ కుమార్తె నాగమణి (28)ని భర్త నగేష్ ఎల్బీనగర్ చింతలకుంట లోని మెడిసిస్ ఆస్పత్రిలో మూడు రోజుల క్రితం చేరింది. గురువారం నాగమణికి వెన్నుపూస ఆపరేషన్ వైద్యులు చేశారు. ఆపరేషన్ వికటించడంతో నాగమణి శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఆమె ఆరోగ్య స్థితి గురించి కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఆపరేషన్ కోసం నాగమణి భర్త ఇప్పటికే లక్ష రూపాయలు చెల్లించాడు. నాగమణి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement