Sunday, May 5, 2024

డీజే టిల్లు సీక్వెల్ నుండి తప్పుకున్న.. అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్..!

డీజే టిల్లు చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సిద్ధు, విమల్ కృష్ణ రచయితలుగా వ్యవహరించారు. భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో దీనికి సీక్వెల్ ప్రకటించారు. డీజే స్క్వేర్ గా టైటిల్ నిర్ణయించారు. టీమ్ లో కొన్ని మార్పులు చేశారు. దర్శకుడిగా విమల్ కృష్ణ స్థానంలో మాలిక్ రామ్ ని తీసుకున్నారు. ఇక హీరోయిన్ గా నేహా శెట్టికి బదులు అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేశారు. డీజే స్క్వేర్ చిత్రీకరణ కూడా జరుపుకుంటుండగా… అనుపమ పరమేశ్వరన్ ని ప్రాజెక్ట్ నుండి తప్పించారంటూ ఒక ప్రచారం మొదలైంది. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేకున్నప్పటికీ గట్టిగా వినిపిస్తోంది. టీమ్ తో ఆమెకు తలెత్తిన వివాదాలే ఇందుకు కారణం అంటున్నారు. ఇక ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటించిన మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement