Friday, April 26, 2024

పాకిస్తాన్ డ్రోన్‌ కూల్చివేత‌..

పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను భారత్ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దళాలు కూల్చివేశాయి. అమృత్‌సర్‌ రూరల్‌ జిల్లా చహర్‌పూర్‌ ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన భద్రతా బలగాలు ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టాయి. సరిహద్దు కంచె వైపు ఉన్న పొలంలో డ్రోన్‌ పడిపోయిందని, అందులో తెలుపు రంగు పాలిథిన్‌ కవర్‌లో అనుమానాస్పద వస్తువుతోపాటు పాక్షికంగా దెబ్బతిన్న ఒక హెక్సాకాప్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ పీఆర్‌వో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement