Thursday, April 25, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 30 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారికి ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తుల‌కు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందుల‌కు క‌ల‌గ‌కుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. సోమవారం తిరుమల శ్రీవారిని 67,468 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 36,082 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement