Sunday, May 19, 2024

మంత్రి కేటీఆర్‌కు మరో ఆహ్వానం.. తమ సదస్సులో ప్రసంగించాలన్న మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. తమ సదస్సులో ప్రసంగించాలని అమెరికాకు చెందిన మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌ కేటీఆర్‌కు ఆహ్వానం పంపింది. లాస్‌ ఏంజిల్స్‌లో మే 1 నుంచి 4వ తేదీ వరకు మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌ 25వ వార్షిక సదస్సు జరగనుంది. సెలబ్రేటింగ్‌ ద పవర్‌ ఆఫ్‌ కనెక్షన్‌ పేరుతో ఈ సదస్సును నిర్వ#హంచనున్నారు. ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించినందుకు మిల్కెన్‌ ఇనిస్టిట్యూట్‌కు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచ ప్రముఖులకు కలిసేందుకు ఇది మంచి వేదిక అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement