Monday, May 20, 2024

ఇష్టం లేని వారు అన్‌ఫాలో కండి.. ఏప్రిల్‌ ఫూల్‌ను అచ్చేదిన్‌ దివస్‌గా పిలవాలి: కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని విమర్శిస్తూ తాను ట్విట్టర్‌లో పోస్టింగ్స్‌ పెట్టిన ప్రతీసారి ఇబ్బంది పడే వారు ఇక నుంచి ట్విట్టర్‌లో తనను అనుసరించొద్దని మంత్రి కేటీఆర్‌ సూచించారు. కేంద్రం, బీజేపీ వైఖరిని, దుష్ప్రచారాన్ని తాను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇక అచ్చే దిన్‌ దివాస్‌ను ఏప్రిల్‌ ఫూల్స్‌ డేగా పోల్చుతూ కేటీఆర్‌ వ్యంగ్యంగా స్పందించారు. కేంద్రం నుంచి సరైన స#హకారం లేకపోవడంతో.. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సందర్భానుసారంగా కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించాల్సిన కేటాయింపులతో పాటు ఇతర సమస్యలపై కేంద్రాన్ని కేటీఆర్‌ నిలదీస్తున్న విషయం విదితమే. కేంద్రం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేటీఆర్‌ ఫైర్‌ అవుతూనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement