Monday, May 20, 2024

హయత్ నగర్ గురుకుల కళాశాలలో 37 మందికి కరోనా

తెలంగాణలో ఇటీవలే విద్యాసంస్థలు తెరుచుకున్నాయి. స్కూళ్లు కాలేజీలు అలా దొరికినాయా లేదో ఇలా కరోనా విద్యాసంస్థలపై పంజా విసురుతోంది. తాజాగా హయత్ నగర్ లోని గురుకుల కళాశాలలో 37 మందికి కరోనా సోకింది. ఇప్పటికే తెలంగాణలోని పలు స్కూళ్లు కళాశాలలో కరోనా ఉండగా ఇప్పుడు అదే జాబితాలోకి గురుకుల కళాశాల చేరింది. సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల హాస్టల్లో 37 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నలుగురు సిబ్బందికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వసతి గృహంలో 400 మంది విద్యార్థులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement