న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం జరిగింది. మందిర్ మార్గ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ బాలాజీ మందిర్లో ఆదివారం సాయంత్రం జరిగిన అన్నదానంలో సుమారు 600 మంది భక్తులు శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఉత్తరాదికి చెందిన దాత విజయ్ గుప్తా ఈ అన్నదానం నిర్వహించారు. స్వామి వారికి నివేదించిన చక్కెరపొంగలి, పులిహోర, దద్దోజనాన్ని భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారితో పాటు ఉత్తరాది భక్తులూ పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement