Sunday, May 12, 2024

రాజ్‌భవన్‌లో హోలీ వేడుకలు రద్దు

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ ఏడాది హోలీ వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండి కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకాలు వేయించుకోవాలని కోరారు. ఈ ప్రక్రియ వైరస్ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు సహాయపడుతుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలని గవర్నర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement