Saturday, April 27, 2024

ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,678 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 271 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 282, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171, కృష్ణా జిల్లాలో 138, ప్రకాశం జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 52, కర్నూలు జిల్లాలో 50, కడప జిల్లాలో 31, తూ.గో. జిల్లాలో 27, అనంతపురం జిల్లాలో 23, విజయనగరం జిల్లాలో 2, ప.గో. జిల్లాలో ఒకరికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 911 మంది కరోనా నుంచి కోలుకోగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,09,002 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,91,048 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 10,710గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,244గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement