Friday, April 26, 2024

వైసీపీ ఎమ్మెల్యేపై రెండు కేసులను ఎత్తివేసిన ఏపీ సర్కారు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై విచారణలో ఉన్న రెండు కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా అంతు చూస్తానని బెదిరించిన ఆరోపణలపై రాజాపై గతంలో రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి.

విజయవాడలోని ప్రజా ప్రతినిధుల క్రిమినల్ కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసుల విచారణ నడుస్తోంది. ఇప్పుడు ఈ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్ దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement