Tuesday, May 14, 2024

రేపు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వేలో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement