Friday, May 10, 2024

వ్యక్తి ఆత్మహత్య యత్నం.. కాపాడిన పోలీసులు..

పెద్ద ముడియం మండలంలోని పెద్ద పసుపుల గ్రామానికి చెందిన పుల్లన్న(57) అనే వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నారు. ముద్దనూరు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వంశీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ముద్దనూరు సీఐ మోహన్ రెడ్డి తక్షణమే రంగంలోకి దిగి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్ప‌గించారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ నాగశేషారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ వంశీ, మహిళా కానిస్టేబుల్ వాణిలను కడప జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement