Saturday, May 4, 2024

ఖుష్బూ ఆస్తుల విలువ రూ. 40.96 కోట్లు

ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ నామినేషన్ దాఖలు చేశారు. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం బీజేపీ నుంచి పోటీ చేస్తోంది. కాగా తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న ఖుష్బూ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం 40.96 కోట్ల రూపాయల ఆస్తి ఉందని, ఇందులో రూ. 6.39 కోట్ల విలువైన చరాస్తులు, రూ.34.56 కోట్ల విలువైన స్థిరాస్తులతోపాటు 8.5 కేజీల బంగారం, 78 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, తన భర్త సుందర్ వద్ద 495 గ్రాముల బంగారం, 9 కిలోల వెండి ఉన్నట్టు తెలిపారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న తన వార్షిక ఆదాయం 1.50 కోట్ల రూపాయలని ఖుష్బూ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement