Monday, April 29, 2024

హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం

హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను కర్ణాటకలోని కిష్కింద సంస్థానం తోసిపుచ్చింది. దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీతో కిష్కింద సంస్థానం ప్రతినిధులు గురువారం చర్చిస్తున్నారు.

టీటీడీ రాష్ట్రీయ సంస్కృత పీఠంలో గురువారం నాడు ఈ విషయమై కిష్కింధ సంస్థాన ప్రతినిధులతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు చర్చిస్తున్నారు. కిష్కింధ సంస్థానం తరపున శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి ఈ చర్చల్లో పాల్గొన్నారు.

టీటీడీ తరపున సంస్కృత యూనివర్సిటీ వీసీతో పాటు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ చర్చలో పాల్గొన్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని టీటీడీ బృందం, కిష్కింధలోని అంజనాద్రే వాయుపుత్రుడి పుట్టిన స్థలమని వాదిస్తున్నారు. ఈ చర్చల తర్వాత చర్చల సారాంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గత నెలలోనే తిరుమలలో అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది.ఈ మేరకు తాము సేకరించిన ఆధారాలను టీటీడీ నియమించిన కమిటీ మీడియాకు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement