Thursday, April 25, 2024

మరో రీమేక్ కి రెడి అవుతున్న మెగాస్టార్ ?

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత లూసిఫర్, వేదాళం రీమేక్ లో నటించబోతున్నాడు చిరు. లుసిఫర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా వేదాళం సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు చిరు.

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి మరో తమిళ సినిమా రీమేక్ కు రెడీ అయినట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఎన్నై అరిందాళ్ సినిమాకి రీమేక్ చేయబోతున్నాడట. ఈ సినిమాను తెలుగులోకి ఎంతవాడుగాని పేరుతో విడుదల చేశారు. అయినా చిరు ఈ సినిమా పట్ల ఆసక్తి కనబరుస్తున్నారట. ఈ సినిమా బాధ్యతను సాహో దర్శకుడు సుజిత్ కి అప్పగించారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement