Sunday, May 5, 2024

ఒకరు కాదు ఇద్దరు కాదు… మొత్తం ఆరుగురు మహిళలు – ఏం జరిగిందో తెలీదు !!

రాజధాని మహానగరంలో మహిళల ఆత్మ హత్యలు కలకలం రేపుతున్నాయి. గడచిన వారం రోజులలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా సోమవారం రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి లో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె వయసు సుమారు 35 సంవత్సరాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కాగా పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో ఆ మహిళ ఎవరు ఏంటి అనేది గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి తరలించారు. అలాగే గత గురువారం కుత్బుల్లాపూర్ లోని పద్మనగర్ ఫేస్ 1లో ఓ బిల్డింగ్ పై నుంచి దూకి 30 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు చేసుకుంది. అలాగే గత సోమవారం నానక్ రామ్ గూడలోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోని బిల్డింగ్ పై నుంచి దూకి పదిహేడేళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి చెందింది. మరుసటి రోజు 23 ఏళ్ల ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి కూడా బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇక అదే రోజు మరొక ఇంటర్మీడియట్ విద్యార్థి కూడా మల్లేపల్లి లోని తన కళాశాల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత గురువారం పెట్ బషీరాబాగ్ లో 28 ఏళ్ల వివాహిత టెర్రస్ పై నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement