Wednesday, May 8, 2024

కృష్ణా జిల్లాలో విషాదం… జామకాయ గొంతులో ఇరుక్కుని 9 నెలల బాలుడు మృతి

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. చల్లపల్లి మండలం పాగోలులో శుక్రవారం నాడు జామకాయ ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక 9 నెలల బాలుడు మృతి చెందాడు. బాలుడు జామకాయతో ఆడుకుంటున్న తరుణంలో జామకాయ ముక్కను నోట్లో పెట్టుకున్నాడు. అయితే జామకాయ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో బాలుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. అనంతరం కాసేపటికే బాలుడు మృతి చెందడంతో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీలో బోగస్ చలానాల స్కాంలో బయటపడుతున్న నిజాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement