Thursday, April 25, 2024

లూసిఫర్ రీమేక్ షూటింగ్ స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తన 153వ చిత్రం లూసిఫర్ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేశారు చిరంజీవి. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ స్టార్ట్ చేశాడు దర్శకుడు మోహన్ రాజా.

ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా…రామ్చరణ్ ఎన్ వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఆ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement