Friday, April 26, 2024

తగ్గేదిలే… పెరిగేదిలే @ఏపీ కరోనా అప్డేట్

ఏపీలో అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 82,297 సాంపిల్స్ ని పరీక్షించగా 2,145 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల ప్రకాశం లో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, కృష్ణ లో నలుగురు, వైఎస్ఆర్ కడప లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, గుంటూరు లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

అలాగే గడచిన 24 గంటల్లో 2,003 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 2,49,46,265 సాంపిల్స్ ని పరీక్షించారు.

మొత్తం కేసుల సంఖ్య :1976141
డిశ్చార్జ్ కేసుల సంఖ్య :1942371
మొత్తం మరణాల సంఖ్య :13468
యాక్టీవ్ కేసుల సంఖ్య : 20302

Advertisement

తాజా వార్తలు

Advertisement