Tuesday, May 14, 2024

విరించి ఆస్పత్రిపై దాడి కేసులో 16 మంది అరెస్ట్

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రిపై దాడి కేసులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుడి బంధువులైన వీరందరిని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వచ్చేనెల 9 వరకు న్యాయస్థానం వీరందరికి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఈ 16 మందిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా జ్వరంతో వచ్చిన వ్యక్తికి స్టెరాయిడ్స్ ఇవ్వడంతో చనిపోయాడని ఆరోపిస్తూ.. మృతుడి బంధువులు విరించి ఆసుపత్రిపై దాడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement