Friday, May 3, 2024

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు షాక్.. వెయ్యి కోట్ల ఆస్తులు సీజ్

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ ప‌వార్‌కు ఆదాయ‌ప‌న్ను శాఖ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ కు చెందిన సుమారు రూ. 1000 కోట్ల ఆస్తుల‌ను ఆదాయ‌ప‌న్ను శాఖ సీజ్ చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవాలలో ఈ ఆస్తులు ఉన్నాయి. ముంబైలోని నారీమ‌న్ పాయింట్ వ‌ద్ద ఉన్న నిర్మ‌ల్ ట‌వ‌ర్‌ను కూడా జప్తు చేసినట్లు తెలుస్తోంది.

గత నెలలో నిర్వహించిన ఐటీశాఖ అధికారులు పవార్ బంధువుల ఇళ్లపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ.184 కోట్ల ఆదాయాన్ని గుర్తించారు. అజిత్ త‌న ఆస్తుల‌ను న్యాయ‌మైన ప‌ద్ధ‌తిలో ఆర్జించ‌లేద‌ని ఐటీశాఖ పేర్కొంది. అజిత్ కుటుంబంపై యాంటీ బినామీ చ‌ట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement