Friday, April 19, 2024

చిన్నారిపై అత్యాచారం.. ఆ పార్టీ నేతలు లైసెన్స్డ్ గూండాల్లా మారారని బండి సంజయ్ ఫైర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై ఓ పార్టీ నాయకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిలోఫర్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న చిన్నారిని, ఆ బాలిక కుటుంబాన్ని బండి సంజ‌య్ ఈరోజు పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఆ పార్టీ నాయకుడిది అత్యంత దుర్మార్గమైన చర్య అని బండి సంజ‌య్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులు లైసెన్స్డ్ గూండాలుగా మారిపోయారని మండిపడ్డారు. అభం శుభం తెలియని పసిపాప బంగారు భవిష్యత్ ను నాశనం చేసిన ఆ మూర్ఖుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ‌లో పసిపిల్లలపై అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితులు లేవని సంజయ్ మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement