Tuesday, May 7, 2024

మహిళా దినోత్సవం నాడు డోర్నకల్‌లో దారుణం

మహిళా దినోత్సవం నాడు మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. డోర్నకల్ మండలం బూరుగు పాడు గ్రామ సమీపంలో అప్పుడే పుట్టిన ఆడశిశువును గోనెసంచెలో పడేసి గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుండీలో వదిలివెళ్లారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగుపాడు గ్రామ శివారులోని చెట్ల పొదలలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను కొందరు వదిలెళ్లినట్లు సమాచారం. అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఆ ఆడ శిశువు ఏడుపులు విని గ్రామంలోకి తీసుకెళ్లారు. గ్రామ పెద్దలు ఆ శిశువును ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement