Thursday, May 16, 2024

మన్నెంలో మెగా సందడి

మన్యంలో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఆచార్య మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ఇద్దరుతో కలిసి మన్యంలో కొన్ని సన్ని వేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ క్రమంలో వారు మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్ లో బస చేసారని తెలియటంతో అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకొన్నారు.ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన కారు నుండి దిగి రామచరణ్ తో కలిసి అభివాదం చేసారు.అభిమానులు హీరో ను చూడగానే కేరింతలు చేస్తూ మురిసిపోయారు. ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ మరోసారి మెగాస్టార్‌ సరసన నటిస్తోంది. రీసెంట్‌గా ఈ చిత్ర టీజర్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌ సంచలనాలను క్రియేట్‌ చేయడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కీలకపాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement