Wednesday, May 15, 2024

పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ అరాచకాలు: చంద్రబాబు

మున్సిపల్ ఎన్నిక‌ల్లో పలు చోట్ల వైసీపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డ‌కుండా ప్ర‌జ‌లు స్వచ్ఛందంగా పోలింగ్ కేంద్రాల‌కు వచ్చి ఓట్లు వేయాల‌ని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నేత‌లు ఓటమి భయంతోనే త‌మ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌పై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతిలో వైసీపీ ఓటమి ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తిరుపతిలోని 18వ డివిజన్‌లో దొంగఓట్లు వేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సోదరుడు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. విజయవాడ 8వ డివిజన్ టీడీపీ నేతలపై దాడి చేశారని.. అలాగే, ఆళ్లగడ్డ మునిసిపాలిటీ 4వ వార్డు అభ్యర్థి కాలేజీ సిబ్బందిని ఆర్వోలుగా నియమించారని ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అరాచకాలు సృష్టిస్తున్నారని, పోలింగ్ శాతం పెరగకుండా చూడాల‌ని భావిస్తున్నార‌ని విమర్శించారు. వైసీపీ పాల్ప‌డుతోన్న చ‌ర్య‌ల‌కు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అడ్డుకట్ట వేయాలని ఆయ‌న కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement