Monday, May 13, 2024

మ‌చిలీప‌ట్నంలో టిడిపి కార్య‌క‌ర్త‌పై వైసిపి వ‌ర్గీయులు క‌త్తుల‌తో దాడి..

మ‌చిలీప‌ట్నం మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీ కార్యకర్తలపై వైసిపి వ‌ర్గీయులు క‌త్తుల‌తో దాడి చేశారు.. ఈ దాడిలో టిడిపి కార్య‌క‌ర్త తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.. వివ‌రాల‌లోకి వెళితే 13వ డివిజన్ లో టీడీపీ సానుభూతిపరుడు దినకర్ పై కత్తులతో వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో దినకర్ తల, మొహం, చేతిపై తీవ్ర గాయాల‌య్యాయి..గాయ‌ప‌డిన దిన‌క‌ర‌న్ ను దినకర్ ను హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి టీడీపీ కార్యకర్తలు త‌ర‌లించారు.. టీడీపీ కార్యకర్తపై దాడి గురించి తెలుసుకున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ హాస్ప‌ట‌ల్ కు చేరుకున్నారు.. దిన‌క‌ర‌న్ ను వారు ప‌రామ‌ర్శించారు.. దినకర్ కు వైద్యం అందించడంలో డాక్టర్ల అలసత్వం ప్ర‌ద‌ర్శిస్తున్నారంటూ డాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొల్లు రవీంద్ర. మచిలీపట్నంలో మంత్రి పేర్ని నాని హింస రాజకీయాలు చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండి ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement