Friday, May 3, 2024

కరోనా టీకా కోసం భారీగా రిజిస్ట్రేషన్లు

కరోనా టీకా కోసం పేరు నమోదు చేయించుకున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దేశంలో ఇప్పటిదాకా 2.6 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ కోసం పేరు నమోదు చేయించుకున్నారని, అందులో 75 శాతం అపాయింట్మెంట్లు కొవిన్ లేదా ఆరోగ్యసేతు యాప్ ద్వారా ఆన్ లైన్ లో జరిగినవేనని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మిగతా రిజస్ట్రేషన్లన్నీ టీకాలు వేసే కేంద్రాల వద్దే జరిగాయని తెలిపింది. ఇక, కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎక్కువగా ప్రభుత్వ కేంద్రాల్లోనే జరుగుతోందని ప్రభుత్వం తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతినిచ్చినా.. అనుకున్న దాంట్లో కేవలం 18 శాతం వరకే వ్యాక్సినేషన్ జరుగుతోందని పేర్కొంది.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో 58.5 శాతం పురుషులుండగా.. 41 శాతానికిపైగా మహిళలున్నారు. ఇతర విభాగంలో 3,775 మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకున్నారు. ఇప్పటిదాకా మొత్తంగా 2.4 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అందులో 82 శాతం మంది మొదటి డోసు తీసుకున్న వారే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement