Tuesday, April 30, 2024

పాతబస్తీలో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మంగళవారం నాడు హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంది. ఈ మేరకు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసింది. ఈ మేరకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ పీవీ సింధుకు శాలువా కప్పి ఘనంగా సత్కరించినట్లు తెలుస్తోంది.

కాగా ఒలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీతో కలిసి పీవీ సింధు ఐస్‌క్రీమ్ తిన్న సంగతి తెలిసిందే. అంతకుముందు స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఎర్రకోటకు కూడా ఒలింపిక్స్ అథ్లెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించగా ఈ బృందంలో కూడా పీవీ సింధు ఉన్నారు. ఈ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆమె మంగళవారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంది.

ఈ వార్త కూడా చదవండి: టీచర్ పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

తాజా వార్తలు

Advertisement