Tuesday, April 23, 2024

సీబీఐ విచారణలో వైసీపీ ఎంపీ అవినాష్ తండ్రి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో 72వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు విచారించారు. ఈ కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. కడప జైలులో విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు.

మరోవైపు వివేకా హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు పది రోజుల పాటు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్లారు. సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పలు వస్తువులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల విచారణలో సీబీఐ కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: టీ20 వరల్డ్ కప్.. పాక్ తో భారత్ మ్యాచ్ ఎప్పుడంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement