Monday, May 6, 2024

టీచర్ పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో టీచర్ పోస్టులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణలో టీచర్ల హేతుబద్ధీకరణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఎస్జీటీ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి స్కూల్‌లో కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండేలా నిబంధనలు రూపొందించింది. ఇక 0-19 మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లలో ఎస్జీటీ పోస్టు ఉండనుంది.

ఇందుకు జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా కమిటీలు ఏర్పాటు చేయనుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. హేతుబద్ధీకరణ అంతరం ఖాళీలను బట్టి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే త్వరలో టీచర్ పోస్టుల భర్తీ ఉండబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిరుద్యోగులు మాత్రం ఇది కేవలం హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని భావిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: బీజేపీ దరఖాస్తుల ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement