Friday, May 3, 2024

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో చోటు చేసుకుంది. నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే, గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్ ను ఇంటికి పిలిపించుకుంది. అదే సమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్ గదిలో చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించి, సోయల్ తనను బలవంతం చేయబోయాడని ఆరోపించింది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement