Monday, April 29, 2024

జస్ట్ వార్మప్ ఇది… నెక్స్ట్ విజయవాడలోనే జండా

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటన చేసినప్పటి నుంచి రాజకీయం వేడెక్కింది. తాజాగా ఇదే విషయమై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. వైఎస్ విజయమ్మకు షర్మిల అంటే చాలా ప్రేమని షర్మిలకు ముందే ఏదైనా కీలక పదవి ఇచ్చుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదన్నారు. ఏడాదిన్నరలో షర్మిల ఏపీ రాజకీయాల్లోనూ అడుగుపెడుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికయితే షర్మిల వార్మప్ చేస్తోందని… ఏపీలో ఎంటరయ్యేందుకు ఇది కేవలం సన్నాహకమేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విజయవాడకు షిఫ్టవడం లాంఛనమేనని రాజన్న రాజ్యం తెలంగాణలో అవసరంలేదని, ఏపీలోనే అవసరం అని తిరిగి వస్తుందన్నారు. షర్మిలకు ముందే డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేస్తే కొత్త పార్టీ విషయంపై వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement