Thursday, April 25, 2024

రైల్వేల ప్రైవేటీకరణ ఉండదు: పియూష్ గోయల్

దేశంలో ప్రైవేటీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్టయినట్లుంది. అటు బ్యాకింగ్ రంగాలను ప్రైవేటీకరించబోవట్లేదని ఇవాళ నిర్మలా సీతారామన్ తెలియాజేసారు. ఇప్పుడు మరో మంత్రి కూడా ప్రైవేటీకరణ పై మాట్లాడారు. రైల్వేలను ఎన్నటికీ ప్రైవేటీకరించమని పియూష్ గోయల్ స్పష్టం చేశాడు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం పై దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తుండంటంతో పియూష్ గోయల్ ఈ విధంగా మాట్లాడారు. అయితే మరింత మెరుగైన కార్యకలాపాల కోసం రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement