Friday, April 26, 2024

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 178 ఆలౌట్ – భారత్ విజయ లక్ష్యం 419 పరుగులు

చెన్నైలో ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ టెస్టు లో ఇండియా విజయం సాధించాలంటే 419 పరుగులు చేయాల్సి ఉంది. ఆటకు రేపు ఆఖరి రోజు. ఈ రోజు కనీసం 16 ఓవర్లు ఆట ఉంది. భారీ స్కోరు ఛేదనలో భారత బ్యాట్స్ మన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ అద్బుతంగా రాణించి ఆరు వికెట్లు పడగొట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement