Saturday, May 25, 2024

దుష్ట సంస్కారాలను పెంచేవాగ్యుద్ధాలు!

కలియుగ దైవం, భక్తుల పాలిటి కల్పవృక్షం అయి న శ్రీ శిరిడీ సాయినాథులది ఒక విశిష్టమైన, అద్భుత మైన, అపూర్వమైన అసామాన్యమైన అవతారం. ఆ దేవదేవుడు సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు. దుర్గు ణములను అలవర్చుకొని పెడత్రోవ పట్టే భక్త జనా వళి హృదయాంతరాలాలలో పేరుకొని పోయి వు న్న అజ్ఞానాంధకారములను పారద్రోలి, జ్ఞాన జ్యోతులను వెలిగించి వారిని సన్మార్గులను చేసే అద్భుతమైన దైవం శ్రీ సాయి. అందుకే శ్రీ సాయి సచ్ఛరిత్రలో దుష్ట శిక్షణ కంటే శిష్ట రక్షణ, భక్త జన సంరక్షణ, సంస్కరణలు గావించిన లీలలే ఎక్కువ గా మనకు కనిపిస్తాయి. అటువంటి ఒక దివ్య లీలను ఈ క్రింద స్మరించుకుందాము.
పండరీపురం సబ్‌ జడ్జి కోర్టులో ప్లీడర్‌గా పనిచే సే ఒక వ్యక్తి ఒకసారి శిరిడీ వచ్చి మశీదులో దర్శనం చేసుకొని, శ్రీ సాయి పాదాలకు నమస్కరించాడు. కొంత పైకం దక్షిణ క్రింద సమర్పించుకొని మశీదు లో జరిగే సంఘటనలను చూడడానికి ఒక ప్రక్కగా కూర్చున్నాడు. ఇంతలో శ్రీ సాయి లాయర్‌ వైపు చూసి ”కలి ప్రభావం వలన ప్రజలెంత టక్కరులౌ తున్నారు. ఒకవైపు దర్శనం చేసుకొని, పాదాలపై పడి నమస్కారాలు చేస్తారు, దక్షిణను ఇస్తారు, కాని చాటుగా నిందిస్తారు, అనవసరమైన వ్యాఖ్యలు చేస్తారు, ఇది ఎంతో చిత్రం కదా !” అని అన్నారు.
అక్కడ వున్న ఎవ్వరికీ శ్రీ సాయి మాటలలోని అంతరార్ధం అవగతమవలేదు. కాని లాయర్‌ మహా శయుడు మాత్రం తప్పు చేసిన వాడిలా తలదించు కున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాటైనా రాలే దు. ఆ తర్వాత వాడాకు వెళ్ళి దీక్షిత్‌ చేతులు పట్టు కొని కన్నీళ్ళతో ”బాబా చెప్పినవన్నీ అక్షర సత్యాలు. ఆ బాణాలను నాపై ప్రయోగించారు. ఇక జీవితం లో నేనెవరిపైనా అనవసరమైన వ్యాఖ్యానాలు, విమ ర్శలు చెయ్యను.” అని అన్నాడు. ఆ తర్వాత అతను అసలు సంగతి దీక్షిత్‌తో చెప్పాడు. పండరీపురం సబ్‌ జడ్జి నూల్కర్‌ ఎన్నో కష్టనష్టాలకు లోనయ్యా డు. తీవ్రమైన అనారోగ్యం పాలయ్యాడు. ఎంత మంది డాక్టర్లను కలిసి ట్రీట్‌మెంట్‌ తీసుకున్నా ప్రయోజ నం లేకపోయింది. తన స్నేహతుని ద్వారా శ్రీ సాయినాథుని గురించి విని శిరిడీకి వచ్చి శ్రీ సాయిని శరణు వేడాడు. పండరీపురం కోర్టు ఆఫీ సులో ఈ విషయం పై పెద్ద చర్చ జరిగింది.
కొందరు నూల్కర్‌ యొక్క చర్యను గట్టిగా సమర్ధించగా ప్రస్తుత కథలోని లాయర్‌ తన విజ్ఞానా న్ని, తెలివితేటలను ఉపయోగించి, తన వాగ్ధాటితో నూల్కర్‌పై, శ్రీ సాయిపై తీవ్రమైన విమర్శలు చేసా డు. అనారోగ్యంతో బాధపడేవారు డాక్టర్‌ వద్దకు వెళ్ళి ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలి గాని ఇలా బాబాల చుట్టూ, స్వాముల చుట్టూ తిరగడం ఏమిటని హళ న చేసాడు. శ్రీ సాయి వంటి వారు భక్తులను ఆకర్షిం చడానికి, వారి నుండి డబ్బు గుంజడానికి కనికట్టు విద్యలను ప్రదర్శించి, ప్రజలను మోసం చేస్తారని, ఇటువంటి వారిని నమ్మకూడదని తీవ్రమైన విమర్శ లు చేసాడు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు పరిస్థి తుల ప్రభావం వలన ఎన్నో కష్టాలకులోనై, వాటిని తీర్చుకునేందుకు ఆ లాయర్‌ శిరిడీ వచ్చి బాబా దర్శ నం చేసుకున్నాడు. శ్రీ సాయి సమయోచితంగా ఆ ప్లీడర్‌కు ఉపదేశం చేసి అతనిలోని విమర్శించే దుర్గు ణాన్ని రూపుమాపారు.
పై లీలను జాగ్రత్తగా అర్ధం చేసుకుంటే మనకు మూడు విషయాలు స్పష్టంగా అర్ధమౌతాయి. (1) ఒకరిపై అనవసరంగా విమర్శలు, వ్యాఖ్యానాలు చెయ్యకూడదు, ఇష్టం వుంటే మాట్లాడాలి, లేకుంటే మౌనంగా అవతలికి వెళ్ళిపోవాలి (2) అనవసరమై న చర్చలు, వాగ్యుద్ధాలలో మనం పాలు పంచుకో కూడదు, అవి మనలోని దుష్ట సంస్కారాలను పెంచి పోషిస్తాయి. (3) శ్రీ సాయి వంటి సద్గురువులు చేసే ఉపదేశాలను పెడచెవిన పెట్టక వాటిని జాగ్రత్తగా అర్ధం చేసుకొని, పదేపదే మననం చేసుకుంటూ #హృదయంలో పదిలపరచుకొని వాటిని నిజజీవి తంలో ఆచరించాలి. ఆచరణలో పెట్టని బోధలు ఎన్ని విన్నా అవి నిష్పలం, నిష్ప్రయోజనమౌతాయి. ఈ లీలలో శ్రీ సాయి చేసిన బోధలను మనం కూడా #హృదయంలో పదిలపరచుకొని, దైనందిన జీవి తంలో ఆచరించి సాయి కృపకు పాత్రులౌదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement