Tuesday, April 30, 2024

Tirumala : తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ…

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు 23 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండ‌గా… ద‌ర్శ‌నానికి 20 గంటల సమయం పడుతోంది. గురువారం తిరుమల శ్రీవారిని 65.062 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.04 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నేడు స్వామివారికి 25,761 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement