Sunday, May 5, 2024

సర్వపాప హరం ఉత్థాన ఏకాదశి వ్రతం

కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి అని పేర్లు. ఆషాఢ శుద్ధ ఏకాదశి, అంటే తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనిద్ర నుండి మేల్కొంటాడు. అందుకే ఈ కార్తీక ఏకాదశి ఉత్థాన ఏకాదశిగా అయ్యింది. దీనినే హరి బోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య మీద శయనించాడు. యజ్ఞవల్క్య మ#హర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణువును పూజించి, రాత్రి అంతా జాగరణ చేసి, మరునాడు ద్వాదశి ఘడియలు ఉండగానే విష్ణు పూజ చేసి, పారణ చేసి (భోజనం చేసి) వ్రతాన్ని ముగించాలి. ఈ ఏకాదశి మ#హత్యాన్ని గురించి బ్రహ్మదేవునికి నారద మ#హర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కంద పురా ణంలో కనిపిస్తుంది. ఉత్థాన ఏకాదశి పాపాలను #హరిస్తుంది. 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలా ఒక జీవుడు, తన వేల జన్మలలో చేసిన పాపాలను కాల్చి వేస్తుంది ఈనాటి ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ రోజు చిన్న మంచిపని (పుణ్య కార్యం) చేసినా, అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది. ఈరోజు ఉప వాసం ఉన్నవారికి ధాన్యం, సంపదలు, ఉన్నతస్థానం కలగడంతోపాటు పాపపరిహారం జరుగుతుం ది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞ యాగాలు, వేదం చదవడంవల్ల కలిగిన పుణ్యానికి కోటిరెట్ల పుణ్యం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఒక్కసారి
చేసినవారికైనా లభిస్తుం ది” అని బ్ర#హ్మదేవు డు నారదునికి వివరించాడు.

ఈ వ్రతంలో ఒకరికి చేసే అన్నదానం వలన సూర్య గ్రహణ సమయంలో పవిత్ర గంగాతీరాన కోటిమందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది. వ స్త్రదానం, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇవ్వడం వలన ఇహ, పర లోకాలలో సర్వసుఖాలు లభిస్తాయి. ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మ#హర్షులు అందరూ విష్ణులోకం చేరి కీర్త నలతో, భజనలతో, హారతులతో శ్రీమహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉత్థాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అప మృత్యు దోషం తొలగిపోతుందని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తికి #హరతి ఇవ్వడం సాంప్రదాయం. ఏవైనా కారణాల వల్ల హారతి ఇవ్వలేకపోతే దేవాలయానికి వెళ్ళి, స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా తిలకించి, వీలైతే హార తి కర్పూరం సమర్పిస్తే అపమృత్యు దోష పరిహారం జరుగుతుంది. స్వామి అనుగ్ర #హం కలుగుతుం ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement