Thursday, May 2, 2024

తిరుమల ఘాట్‌ రోడ్డును పరిశీలించిన కేరళ నిపుణులు

తిరుమల, ప్రభన్యూస్‌: ఇటీవల వర్షాలకు ఘాట్‌రోడ్డులో విరిగి పడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ స్లైడ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ కింద అంతర్జా తీయప్రాజెక్టు చేస్తున్న నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండచ రియలు విరిగి పడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది. వారు కొండచరియలు విరిగిపడిన ప్రాంతం లో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక శాస్త్ర పరిజ్ఞానం ఉపయోగించుకుని సమగ్ర సర్వే నిర్వహించి టీటీడీకి నివేదిక అందించనున్నారు. ఈ కార్యక్రమంలో అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్‌ ఇన్షియేటివ్స్‌ రీసెర్చ్‌ అనండ్‌ ఇన్నోéవేషన్‌ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్‌ మనీషా, ప్రొఫెసర్‌ నిర్మల వాసుదేవన్‌, ప్రొఫెసర్‌ సుదీప్‌ విద్వాన్‌, టీటీడీ డీఎఫ్‌ఓ శ్రీనివాసులురెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement