Monday, April 29, 2024

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండి కిలోమీటర్‌ మేర భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వర్గాలు వెల్లడిం చాయి. నిన్న శ్రీవారిని 68,873 భక్తులు దర్శించుకోగా 38,952 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement