Sunday, April 28, 2024

రికార్డు స్థాయిలో ఎములాడ రాజ‌న్న హుండీ ఆదాయం

వేములవాడ : మేడారం జాతర సీజన్ తో వేముల‌వాడ‌ రాజన్న హుండీకి రికార్డ్ స్థాయిలో కేవలం 12 రోజుల్లో రూ.3 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గత నెల 27వ తేదీ నుండి భక్తులు స్వామి వారికి సమర్పించిన ఆదాయాన్ని లెక్కింపు ప్రక్రియ ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో రెండు రోజులపాటు కొనసాగించారు. మంగళవారం నాటికి రూ.2 కోట్ల 15 లక్షల హుండీ ఆదాయాన్ని లెక్కించిన అధికారులకు.. బుధవారం మరో 92 లక్షల 92 వేల 366 రూపాయ‌లు నగదు రూపంలో సమకూరింది. దీంతో రాజన్న హుండీ ఆదాయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 12 రోజుల్లోనే రూ.3 కోట్లకు పైగా ఆదాయం లభించడంతో రికార్డ్ సాధించినట్లయ్యింది. ఇక భక్తులు నగదుతో పాటు 289 గ్రాముల బంగారాన్ని, 12 కిలోల 944 గ్రాముల వెండిని కానుకల రూపంలో రాజన్నకు సమర్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement