Sunday, April 28, 2024

రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వ వాటా జమ చేయకపోవడమే అసలు సమస్య అని అన్నారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో ఇక్కడి వైసీపీ ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని తెలిపారు.

రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ఈ ప్రాజెక్టులు… రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయన్నారు. కోటిపల్లి – నరసాపురం రైల్వే లైన్ అనేది ఎప్పటి నుంచో వింటున్నదే అని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 25% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని… ఆ మొత్తాన్ని ఇవ్వకపోవడంతో ముందుకు వెళ్ళడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ.1351 కోట్లు, కడప – బెంగళూరు లైనుకు రూ.289 కోట్లు, రాయదుర్గం – తుముకూరు లైనుకు రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఇలాగైతే ఈ లైన్లు ఎప్పటికి పూర్తవుతాయని జనసేన అధినేత నిలదీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement