Friday, May 3, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ… భారీగా శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 8 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. వీరికి 6 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న శ్రీవారిని 81,287 మంది భక్తులు దర్శించుకోగా 34,436 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3. 83 కోట్లు వచ్చిందని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement