Saturday, May 18, 2024

విష్ణుమూర్తికి రాగిపాత్రలో నైవేద్యం పెడితే

శ్రీ మహావిష్ణువుకు రాగిపాత్రలో నైవేద్యమంటే అమిత ఇష్టం, ఇందువెనుక ఒక కథ ఉంది.
ఆ కథ సాక్షాత్‌ శ్రీ మహా విష్ణువే చెప్పాడు.
పూర్వం గుడాకేశుడనే రాక్షసుడు ఉండేవాడు,అతడు పుట్టుకతో రాక్షసుడైనప్పటికీ, ఎలాంటి రాక్షస లక్షణాలు లేకుండా దైవచింతనలోనే ఉండేవాడు. గుడాకేశుడు విష్ణువు భక్తుడు. నిరంతరం విష్ణువు నామాన్నే జపిస్తూ ధర్మకార్యాలను నిర్వర్తిస్తూండేవాడు.
ఇదిలాగ ఉండగా, ఆ రాక్షసునికి విష్ణువును గురించి తపస్సు చేయాలనిపించింది. పదహారువేల సంవత్స రాలు విష్ణువు గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుని మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.
అందుకు గుడాకేశుడు, తనకు ఏమి అక్కర్లేదని, కొన్ని వేల జన్మలపాటు తాను విష్ణుభక్తిలో మునిగిపోయే విధంగా వరాన్ని అనుగ్రహంచమన్నాడు.
అలాగే తన మరణం విష్ణుచక్రం వల్ల మాత్రం ఏర్పడి, తదనంతరం తన శరీరం రాగిలోహంగా మారి పోవాలని కోరుకున్నాడు. విష్ణువు ఆ రాక్షసుడు కోరు కున్న వరాలను అనుగ్రహంచి అంతర్ధానమ య్యాడు,గుడాకేశుడు సంతోషించాడు.
విష్ణుమూర్తి అనుగ్రహంచినా కూడా గుడాకేశు డు తపస్సు చేస్తూనే ఉన్నాడు, వైశాఖ శుద్ధ ద్వాద శినాడు ఆ రాక్షసుని కోరి కను తీర్చాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుని, మిట్టమధ్యాహ్నపువేళ తన చక్రా యుధాన్ని ప్రయోగించాడు.
తన కోరిక ఎప్పుడు నెరవేరుతుందా అని ఎదురు చూస్తున్న గుడాకేశుడు మిక్కిలి సంతోషించాడు, విష్ణుచక్రం ఆ రాక్షసుని తలను ఖండిం చింది, వెం టనే అతడి మాంసమంతా రాగిగా మారిపోయింది, ఆ రాక్షసుని ఎముకలు వెండిగా మారాయి, మలినాలు కంచులోహంగా మారాయి.
గుడాకేశుని శరీరం నుండి ఏర్పడిన రాగితో ఒక పాత్ర తయారు అయ్యింది, ఆ పాత్రలో విష్ణువుకు నైవేద్యం సమర్పించబడింది, ఆ పాత్రలో నైవేద్యాన్ని స్వీకరించడ మంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం. తన భక్తులు కూడా రాగి పాత్రలో నైవేద్యాన్ని సమర్పించాలని సూచించాడు విష్ణుమూర్తి, రాగిపాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతు కులు ఉంటాయో, అన్ని వేల సంవత్సరాల పాటు ఆ నైవే ద్యాన్ని పెట్టిన భక్తుడు వైకుంఠంలో ఉండగలడని విష్ణు మూర్తి సెలవిచ్చారు.
అందుకే విష్ణుమూర్తికి రాగిపాత్ర లో నైవేద్యం సమ ర్పించటం వెనుక ఇంత కథ ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement